AP Govt JobsLatest Govt jobs

సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | RBK లో 7384 ఉద్యోగాలు | Sachivalayam 3rd Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులు ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఉన్నట్టువంటి అన్ని సచివాలయం లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. అలానే రైతు భరోసా కేంద్రం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్, సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ నీ రాత పరీక్ష ద్వారా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఖాళీలు, విద్య అర్హత, వయస్సు మరిన్ని డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. మరిన్ని జోబ్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

. TELEGRAM GROUP

• అత్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు

• 1,844 ఉద్యాన సహాయకులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి ఏర్పాట్లు ప్రస్తుతం ఆర్బీకేల్లో 14,347 మంది సేవలు

• కొత్త పోస్టుల భర్తీతో 21,731 మందికి చేరనున్న ఆర్బీకే సిబ్బంది.

వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అ డుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టింది. 660 మండ లాల్లో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేయగా వీటిలో 14,37 మంది సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో ఇంకా శాఖల వారీ ఖాళీగా ఉన్న 7,384 పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఆర్బీకేల ఏ ర్పాటు సమయంలో మంజూరు చేసిన పోస్టుల సం ఖ్యను బట్టి శాఖల వారీగా ఖాళీలను గుర్తించారు. అ త్యధికంగా 5,188 పశుసంవర్ధక సహాయక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి తర్వాత 1,644 ఉద్యాన, 487 వ్యవసాయ, 63 మత్స్య, 22 పట్టు సహాయకు పోస్టులు ఖాళీగా ఉన్నట్టుగా లెక్కతేల్చారు. ఏపీ పీఎస్సీ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటికి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులను కూడా భర్తీ చేస్తే ఆ ర్బీకేల్లో పనిచేసేవారి సంఖ్య 21,731 కి చేరుతుంది.

ALSO READ  Latest RRB Recruitment 2023 | దక్షణ రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

ఆర్టీకేలకు ఇన్చార్జిలుగా..

ప్రస్తుతం ఆర్బీకేల్లో పనిచేస్తున్న మొత్తం 14,347 మందిలో ప్రధానంగా 6.291 మంది వ్యవసాయ, 2,356 మంది ఉద్యాన, 4,652 మంది పశుసంవ ర్ధక, 731 మంది మత్స్య. 317 మంది పట్టు సహాయకులు ఉన్నారు. స్థానికంగా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పట్టు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖల సహాయకులు స్థానిక ఆర్పీకేలకు ఇనా ర్ట్లుగా వ్యవహరిస్తున్నారు. మెజార్జీ ఆర్బీకేల్లో వ్యవ సాయ, ఉద్యాన సహాయకులే ఇన్చార్జిలుగా ఉన్నారు. కొన్నిటిలో మాత్రం పట్టు, మత్స్య సహాయకులు ఇన్చార్ట్లుగా పనిచేస్తున్నారు. ఇతర పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి ఆయా శాఖలకు చెం దిన సహాయకులు సెకండ్ ఇన్చార్జిలుగా సేవలంది స్తున్నారు. మెజార్టీ ఆర్బీకేల పరిధిలో పాడి సంపద ఉండడంతో ప్రతి ఆర్బీకేకు ఓ పశుసంవర్ధక సహాయకుడు చొప్పున కేటాయించారు. ఇలా దాదాపు మెజార్జీ ఆర్పీ కేల్లో ఒకరు లేదా ఇద్దరు చొప్పున సేవలు అందిస్తున్నారు.

ALSO READ  APPSC నుండి 900 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

సచివాలయాల్లోనూ..

ఆర్బీకేలతో పాటు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ ఇచ్చేం దుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సంక్రాం తిలోగా నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రతి ఆర్బీకేలో స్థానికంగా ఉండే పాడిపంటలను బట్టి సిబ్బంది ఉండేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వాటికనుగుణంగా ఖాళీ పోస్టుల భర్తీ కోసం చర్యలు చేపట్టాం. -వై.మధుసూదనరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ

ALSO READ  Latest RRB Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో 500 పైగా ఉద్యోగాలు | Latest Railway Recruitment 2023

ఇప్పటికే సీఎం ఆదేశాలు..

ఈ-క్రాప్, ఈ-కేవైసీ, పాలం బదులు, తోట, మత్స్య సాగు బడులు, పశువిజ్ఞాన బడుల నిర్వహ ణతో పాటు ఇతర రైతు ప్రాయోజిత కార్యక్రమాల

ఆమలు కోసం ఆర్బీకే సిబ్బంది క్షేత్ర స్థాయి పర్య టనలకు వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్బీకే లకు వచ్చే రైతులకు ఆటంకాలు లేకుండా సేవలం దించడానికి స్థానికంగా చురుగ్గా ఉండే వలంటీర్ను ఆర్బీకేలకు అనుసంధానించారు. మరోవైపు గ్రామ స్థాయిలో బ్యాంకింగ్ సేవలందించే సంకల్పంతో 9,160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను కూడా ఆర్బీకేలకు అనుసంధానం చేశారు. వన్ స్టాప్ సాల్యూషన్ సెంటర్స్ గా వీటిని తీర్చిదిద్దడం తోపాటు రైతులకు అందించే సేవలన్నింటినీ ఆర్బీకే లు కేంద్రంగా అందిస్తున్నారు. దీంతో ఆర్బీకేల్లో సిబ్బందిపై పనిఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసారు.

AP పౌరసరఫరాల శాఖ లో ఉద్యోగాలు

AP లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!