AP తల్లికి వందనం 13000 ఎందుకు వేసారు 2000 తగ్గడానికి కారణం | AP Talliki Vandanam Status Check | AP Talliki Vandanam List
Thalliki Vandanam Big Update:
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో చదువుకునే పిల్లలకు ఆర్థిక సాయంగా తల్లికి వందనం స్కీమ్ ను ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ప్రకారం ఒక తల్లి కి ఎంత మంది పిల్లలు ఉండి వారు స్కూల్ కి వెళ్తుంటే, స్కూల్ కి వెళ్తున్న ప్రతి విద్యార్థి కి 15,000 రూపాయల చొప్పున వారి తల్లి అకౌంట్ లో జమ చేస్తారు. 1వ తరగతి నుండి ఇంటర్ చదువుకునే అందరికీ ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా సుమారు 67 లక్షల పైగా విద్యాద్రులకు మేలు జరుగుతుంది. ఈ స్కీమ్ కొరకు ప్రభుత్వం అక్షరాల 8,745 కోట్లు రూపాయలను పిల్లల తల్లుల ఖాతాలోజమ చేస్తుంది.
కూటమి ప్రభుత్వం ప్రారంభించిన తల్లికి వందనం ఈ పథకం కింద సంవత్సరానికి రూ. 15000 ఆర్థిక సాయం విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనుంది. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రతి విద్యార్థికి లబ్ధి పొందేలా ఈ చర్యలు చేపట్టారు. ఏడాదికి రూ. 15000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అయితే ఈ 15,000 రూపాయలలో తల్లుల ఖాతాలో రూ.13వేల నగదు జమ చేస్తామని మిగతా రూ.2000 మినహాయింపును రాష్ట్రంలోని స్కూలు, కాలేజీలు అభివృద్ధి పనుల కోసం ఉపయోగిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ మినహాయించిన నిధులను కలెక్టర్ ఆధ్వర్యంలో జమ చేయనున్నట్లు తెలిపింది. మీ పిల్లలకు ఈ స్కీమ్ ద్వారా డబ్బు తల్లుల అకౌంట్ లో జమ చేశారు లేదో క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి మీ డిటైల్స్ ( రేషన్ కార్డు నెంబర్ / ఆధార్ కార్డు నెంబర్ ) ఫిల్ చేసి సబ్మిట్ చేయండి మీ స్టేటస్ వస్తుంది.
Status Check Link : Click Here