ఆంధ్ర డ్వాక్రా మహిళలకు ఉచితంగా 70000 ప్రభుత్వం ఇస్తుంది | Good News For AP Dwakra Womens

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల ఆదాయం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని వ్యవసాయ మహిళలకు వెదురు సాగుకి పెట్టుబడి సాయం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా వెదురు సాగుకు అవసరమే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీని ద్వారా మహిళలు నెలకు 50,000 నుండి 70,000 వరకు ఆదాయం పొందవచ్చు. రాష్ట్రంలో ఈ ఏడాది మొదటి విడతగా 10 వేల మంది మహిళలను వెదురు సాగు వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు ఉచితంగా ఇచ్చి మీ పొలంలో వాటిని నాటిస్తారు. అంతేకాదు, సాగుకు అయ్యే ఖర్చులను కూడా నెల నెల ప్రభుత్వమే చెల్లిస్తుంది. మొదటి దశలో రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.

Telegram Group Join Now

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ అందిస్తాం అని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆదాయం పెంచడానికి మరో కొత్త పథకం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు వారి వ్యవసాయ పొలంలో వెదురు సాగు చేస్తారు. వెదురు ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది రాష్ట్రంలో 10 వేల మంది మహిళలను వెదురు సాగు వైపు ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకొని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అధికారులు 2 వేల మందిని ఎంపిక చేశారు.

జూలై నెలలో రాష్ట్రంలో వర్షాలు బాగా కురుస్తాయి, ఆ సమయంలో మొక్కలు నాటితే బాగుంటుంది అని ప్రభుత్వం భావిస్తుంది. ఈ నెలాఖరుకు డ్వాక్రా మహిళలు 5 వేల మందిని ఎంపిక చేసి, వచ్చే నెల నుంచి సాగు మొదలు పెట్టడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నారు. వెదురు సాగులో అనుభవం లేని వారికి సలహాలు, సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) ఇండస్ట్రీ ఫౌండేషన్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఆహార పంటల ఉత్పత్తి తగ్గకుండా మొదట డ్వాక్రా మహిళల పొలంలో కేవలం 30 సెంట్లలో వెదురు సాగు చేస్తారు. ఉపాధి హామీ పథకం కింద మొక్కలు ఉచితంగా ఇస్తారు. అంతేకాదు, సాగుకు అయ్యే ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వెదురు రకాలతో పాటుగా మన దేశంలోని త్రిపుర నుంచి బార్బుసా న్యూటన్స్, బార్బుసా టుల్డా అనే రెండు కొత్త రకాలను కూడా తెప్పిస్తున్నారు. మొదటి దశలో అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, నంద్యాల జిల్లాలలో ఈ సాగును ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లిలో వెదురు ప్రాసెసింగ్ ప్లాంటును ప్రభుత్వం రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తుంది.

ఈ ప్లాంటు చుట్టుపక్కల ఉన్న 450 ఎకరాల్లో గిరిజన మహిళలతో వెదురు సాగు చేయిస్తారు.. అలాగే యువతకు కూడా ఉద్యోగాలు లభిస్తాయి అని ప్రభుత్వం చెప్తుంది. వెదురు నాటిన తర్వాత నాలుగో సంవత్సరం నుంచి 40 ఏళ్ల వరకు ఆదాయం వస్తుందాని అంటున్నారు సెర్ప్ అధికారులు. వెదురు నాటిన నాలుగో సంవత్సరం రూ.50 వేలు, ఐదో ఏడాది రూ.70 వేలు ఇలా ఏటా క్రమంగా ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. డ్వాక్రా మహిళలు వెదురు సాగు చేయడం ద్వారా డ్వాక్రా మహిళలు మంచి ఆదాయం పొందవచ్చు అంటున్నారు. ఈ సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం 4 సంవత్సరాలు ఆర్థిక సాయం చేస్తుంది. త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి అంటున్నారు.

Author

  • Mohan Reddy - I am a passionate freelance content writer with over 7 years of experience, specializing in creating impactful content across diverse domains. Along the way, I have honed my expertise in digital marketing, SEO strategies, and web designing, enabling me to build strong online presences and drive visibility for various projects. Through my journey, I observed the struggles faced by many candidates in finding the right employment opportunities. This inspired me to create a unique niche platform – alljobsintelugu.com – dedicated to providing the latest job updates in the Telugu language. My mission is to simplify the job search process for Telugu-speaking candidates and empower them with timely, reliable, and accessible opportunities.

Leave a Comment

error: Content is protected !!