ఇంటర్ వారికి తల్లికి వందనం స్కీమ్ మీద కీలక అప్డేట్ | Talliki vandanam For Intermediate Students
Talliki vandanam For Intermediate Students 2025
Thalliki vandanam for Intermediate students. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా మొదటగా 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ చదివే వారికి వారి తల్లి అకౌంట్ లో డబ్బులు జమ చేసింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్డేట్ ఇచ్చింది.
Thalliki vandanam for Intermediate students
2025 – 2026 విద్యా సంవత్సరం కొరకు ఇంటర్ మొదటి సంవత్సరం లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఈ స్కీమ్ ద్వారా తల్లి బ్యాంకు అకౌంట్ లో నగదును జమ చేయనుంది.
ఈ స్కీమ్ ద్వారా ఎవరికి వర్తిస్తుంది అంటే ఏ విద్యార్థులు అయితే జూన్ 30వ తేది లోపు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటర్మీడియట్ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్ పొంది ఉండాల్సి ఉంటుంది.
అలా అడ్మిషన్స్ పొందిన వారికి మాత్రమే తల్లికి వందనం కింద జూలై 5వ తేదీ వరకు తల్లికి వందనం కింద నగదు జమ అవుతుందని ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
సంబంధిత కళాశాలలు అడ్మిషన్లు పొందిన విద్యార్థులు వారి వివరాలను యుడైస్ లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వారికి మాత్రమే నగదు జమ అవుతుంది. దీని ఆధారంగానే అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్టేటస్ చెక్ చేసుకునే మరియు సబ్మిట్ చేసే లింక్ క్రింద ఇచ్చాను చెక్ చేసుకోగలరు.
Status & Apply Link : Click Here